Friday, April 19, 2024

ఆరేళ్ల కొడుకును హత్య చేసిన తల్లి…

- Advertisement -
- Advertisement -

Mother Murdered Her Son in Kerala Palakkad

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌లోని పూలక్కాడ్‌ గ్రామంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ తల్లి తన 6 ఏళ్ల కుమారుడిని గొంతు కోసి హత్య చేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మూడు నెలల గర్భవతి అయిన షాహిదా తనమూడో కొడుకును ఇంట్లోని బాత్రుమ్ లో హత్య చేసింది. హత్య చేసిన తరువాత, షాహిదా తన పొరుగువారి ఇంటికి వెళ్లి హత్య గురించి జనమైత్రి పోలీసులకు సమాచారం ఇచ్చింది. హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నారు. షాహిదా మానసిక స్థితిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Mother Murdered Her Son in Kerala Palakkad 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News