Wednesday, April 24, 2024

మైనర్ కొడుకును చంపించిన తల్లి

- Advertisement -
- Advertisement -

mother murdered her son in vikarabad

వికారాబాద్: సుపారీ ఇచ్చి కొడుకునే ఓ తల్లి చంపించిన దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా పులుమద్ది గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పులుమద్ది గ్రామంలో నివాసం ఉంటున్న శివప్రసాద్ (17)ను సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పీచరగాడి తండా సమీపంలో దారుణంగా హత్యచేశారు. తాగొచ్చి రోజు ఇబ్బంది పెడుతుండటంతో అతని తల్లి తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టింది. ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు హత్య చేయించాలని నిర్ణయించుకుంది. తన తమ్ముడితో కలసి మర్డర్ ప్లాన్ వేసింది. అనంతరం సుపారీ ఇచ్చి చంపించేసింది. వికారాబాద్ కోహ్లీ ప్రాతంలో వారం క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వారం రోజుల క్రితం మిస్ అయిన శివప్రసాద్ మృతదేహాన్ని ఓ బావిలో పోలీసులు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ కేసులో నిందితులైన మృతుడి తల్లి, మేనమామ సహా ఆరుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

mother murdered her son in vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News