- Advertisement -
హైదరాబాద్: నగరంలోని హబీబ్ నగర్ లో బుధవారం దారుణం చోటుచేసుకుంది. భర్తపై కోపంతో ఓ భార్య తన కొడుకును రూ.45 వేలకు అమ్మేసింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్థానికులు చెబతున్నారు. మద్యం మత్తులో భార్యతో గొడవపడి భర్త బయటికి వెళ్లాడు. ఇంటికి తిరిగొచ్చేసరికి బాబు కనిపించకపోవడంతో ఆరా తీశాడు. అప్పుడు బాబును అమ్మేసినట్టు భార్య చెప్పింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబును కొనుగోలు చేసిన వారితో పాటు ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
Mother sold her son at Hyderabad
- Advertisement -