- Advertisement -
అమరావతి: విజయవాడ వాంబే కాలనీలో గురువారం విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. విజయవాడ వాంబే కాలనీ డి-బ్లాక్ లో ఈ సంఘటన జరిగింది. తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారని స్థానికులు తెలిపారు. భర్తనే ఈ హత్యలు చేసిఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Mother two children killed in suspicious condition
- Advertisement -