- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. పరీక్షల్లో కోవిడ్-19 నిర్ధారణ అయినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు ఆయన ట్వీట్టర్ ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా తనతో పాటు ఉన్న వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో మంత్రులు, ఎంఎల్ఎలు, అధికారులు, ప్రముఖులు కోవిడ్ బారినపడి తిరిగి కోలుకున్నారు.
I have been tested positive for covid and isolated myself on doctor’s advice. Who ever has been in contact from the past few days, please take necessary precautions…
— Revanth Reddy (@revanth_anumula) March 23, 2021
MP Revanth Reddy Tested For Covid Positive
- Advertisement -