Tuesday, April 23, 2024

చంద్రుడికో హరిత పోగు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం పునర్ నిర్మించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నమ్మినబంటైన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిఎం కెసిఆర్ నిర్ణయానికి మద్దతుగా, కోట్లాది మంది ఆంజనేయ భక్తులకు బాసటగా కొండగట్టు ఆలయా న్ని ఆనుకుని ఉండే వెయ్యి ఎకరాల అభయారణ్యం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ తరఫున దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 17 న కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన కెసిఆర్, స్వరా ష్ట్రం సిద్దించాక గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఆ యన తపనను అతి దగ్గరి నుంచి చూసిన వ్య క్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపి సంతోష్ వెల్లడించారు.

ఆంజనేయుడి ప్రధాన లక్షణాలై న పరాక్రమం, విశ్వాసం కెసిఆర్ సొంతమని, అభివృద్ది నిర్ణయాల్లో పరాక్రమం, తెలంగాణ పట్ల ఆయన విశ్వాసం వెలకట్టలేనివని అన్నా రు. అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సిఎం కాంక్షిస్తున్నారని, కాళేశ్వరం కట్టినా, యాదాద్రి పునర్ నిర్మాణం చేసినా, ఇప్పుడు కోటి మొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ది నిర్ణయమైనా కెసిఆర్ దార్శనికతకు నిదర్శనమన్నారు. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన వెన్నంటి, మద్దతుగా నిలవటం తనకు లభించిన వరంగా భావిస్తూ, సిఎం కెసిఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని అంజన్న సన్నిధి వెన్నంటి ఉండే వెయ్యి ఎకరాలకు పైగా అభయారణ్యాన్ని దత్తత తీసుకుంటున్నానని తెలిపారు. కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్టెమెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్లు… తొలి విడతగా కోటి రూపాయల వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని ప్రకటించారు.

దశల వారీగా మిగతా నిధులు కూడా అందించి లక్షిత పనులు పూర్తి చేస్తామని తెలిపారు. చిన్నతనం నుంచే కెసిఆర్ వెంట ఉన్న తనకు కొండగట్టుతో బలమైన అనుబంధం ఉన్నదని, అనేక సార్లు ఆంజనేయుడిని దర్శించుకుని ఈ అటవీ ప్రాంతంలో సేదతీరిన అనుభూతులు ఉన్నాయన్నారు. ఈ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు నాటుతామన్నారు. అటవీశాఖ అధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణతో పాటు, పునరుజ్జీవన చర్యలు చేపడతామన్నారు. సహజ అడవి పునరుద్దరణకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో పాటు, నేలలో తేమ పరిరక్షణ చర్య లు చేపడతామన్నారు. ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్ద ఎత్తున పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు, పచ్చని ప్రకృతి మధ్య కాసేపు సేద తీరేలా పరిసరాలను తీర్చిదిద్దుతాని, మట్టితో వాకింగ్ ట్రాక్ తో పాటు, పగోడాలను ఏర్పాటు చేస్తామన్నారు.

ఏ లక్ష్యంతోనైతే ముఖ్యమంత్రి కొండగట్టు పునర్ నిర్మాణం చేపడుతున్నారో, దానికి మద్దతుగా తమ వంతు ప్రయత్నం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఉంటుందని ఎంపి సంతోష్ ప్రకటించారు. శ్రీరాముడికి నమ్మిన బంటు ఆంజనేయస్వామి, అలాంటి ఆంజనేయుడు స్వయంభుగా వెలసిన ప్రాంతం జగిత్యాల జిల్లా కొండగట్టు అని పేర్కొన్నారు. సహజమైన కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునర్ నిర్మించేలా సిఎం కెసిఆర్ నిర్ణయించారని మరోమారు పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News