Saturday, April 20, 2024

ఈ పుట్టుక నాది.. బతుకంతా మీది

- Advertisement -
- Advertisement -

MP Santosh Kumar birthday celebration

పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగంతో ఎంపి సంతోష్‌కుమార్ ట్వీట్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం నాడు మొక్కలు నాటడం తదితర విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.
బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎంఎల్‌ఎ బేతి సుభాష్‌రెడ్డితో కలిసి టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త పాల్గొన్నారు.

అంధుల పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్టింగ్,దుప్పట్ల పంపిణీ
ఉప్పల్ భగాయత్‌లో మొక్కలు నాటిన ఎంపి
సంతోష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సేవా కార్యక్రమాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తన పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎంఎల్‌ఎ బేతి సుభాష్‌రెడ్డితో కలిసి టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఉప్పల్ భగాయత్‌లో ఎంఎల్‌ఎ బేతి సుభాష్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఉప్పల్ ఎంఎల్‌ఎ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కొన్ని వందల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కెక్ కట్ చేసి ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ సిఎం కెసిఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్దలందరి మన్ననలను పొందుతూ అందరినీ ఆకర్షిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచినారని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా గ్రీనరీని ప్రోత్సహిస్తున్న జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సిలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రావు, టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆర్గనైజర్ రాఘవ, బన్నాల గీత ప్రవీణ్‌కుమార్ ముదిరాజ్, చిలుకానగర్ ఏడవ డివిజన్ కార్పొరేటర్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి, యువ డైరెక్టర్ పూర్ణ, వివిధ డివిజన్ స్థాయి అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మహిళా సంఘాల నాయకులు, ఉప్పల్ సాయికిరణ్, ఉప్పల్ సాయితేజ్, నాయకులు పాల్గొన్నారు.

షరీఫ్ దర్గాకు చాదర్ సమర్పణ

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా తన ఇంటి నుంచి ప్రత్యేక శ్రద్ధతో తీసుకువచ్చిన చాదర్‌కు నాంపల్లి యూసఫ్, షరీఫ్ దర్గా నుండి వచ్చిన మత పెద్దలు ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సంతోష్‌కుమార్, వారి కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ప్రత్యేక ప్రార్థనలు(దువ్వా) నిర్వహించి నాంపల్లి యూసఫ్, షరీఫ్ దర్గాకు సమర్పించమని జిహెచ్‌ఎంసి మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌కి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, టిఎస్‌టిఎస్ చైర్మన్ చిరుమళ్ల రాకేష్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్

తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టిఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్‌ను రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ కలిశారు. సంతోష్‌కుమార్‌కు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు ఎంపి సంతోష్‌కు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సంతోష్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఢిల్లీలో జన్మదిన వేడుకలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ మంగళవారం పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్ ఎంపిలు ఢిల్లీలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎంపిలు పాల్గొన్నారు. మొక్కలు నాటి, కేక్ కట్ చేసి ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News