- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రి కెటిఆర్ బర్త్డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి ఎంపి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించగా మంత్రి కెటిఆర్ సైతం తనకు బర్త్డే గిఫ్ట్గా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కెటిఆర్ మొక్కలు నాటాలని పిలుపునివ్వడం పట్ల ఎంపి సంతోష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపిన సంతోష్.. ఈ బర్త్డే మీకు చిరకాలం గుర్తుండిపోతుందని వెల్లడించారు.
MP Santosh Kumar calls to gift 1 Cr Plant Sapling
- Advertisement -