Thursday, April 18, 2024

సినీ నటీనటులతో కలిసి మొక్కలు నాటిన ఎంపి సంతోష్ కుమార్..

- Advertisement -
- Advertisement -

MP Santosh Kumar plant saplings with actors

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుంది. ఆదివారం జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని జిఎచెంసి పార్క్ లో నిర్వహించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో బాగంగా సినీ, టివి రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ఎంపి సంతోష్ కుమార్ పాల్గొని సినీ, టీవి నటులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంపత్ నంది, కాదంబరి కిరణ్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మానస్, కాజల్, జబర్దస్త్ రాకేష్, అదిరే అభి, టివి ఫెడరేషన్ ఫౌండర్ నాగ బలసూరేష్ కుమార్, టీవి నటులు మీనా, సన, వైభవ్ సూర్య, రాజేంద్ర, టార్జాన్, డైరెక్టర్స్ పులి వాసు, ప్రసాద్, దీప్తి బాజ్ పెయ్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.

MP Santosh Kumar plant saplings with actors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News