Saturday, April 20, 2024

అజయ్ దేవగణ్‌కు థ్యాంక్స్ చెప్పిన ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు టిఆర్‌ఎస్ ఎంపి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ థ్యాంక్స్ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని దండు మైలారం ఇండస్ట్రియల్ పార్కులో అజయ్ దేవగణ్ ఆరు నెలల క్రితం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం అజయ్ దేవగణ్ ఎన్‌వై ఫౌండేషన్‌ను స్థాపించిన విషయం విదితమే. తన ఫౌండేషన్ కార్యక్రమాల్లో సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను భాగస్వామ్యం చేస్తూ అజయ్ దేవగణ్ మొక్కలు నాటారు. అయితే ఇప్పుడు ఆ మొక్కలు పెద్దయి పువ్వులు పూస్తూ ఆహ్లాదాన్ని అందిస్తున్నాయని ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ తెలిపారు. ట్విట్టర్ ద్వారా అజయ్ దేవగణ్‌కు థ్యాంక్స్ చెప్పిన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు పెరిగి పూలు పూసి ఆకట్టుకుంటున్న వీడియోను కూడా షేర్ చేశారు.
మొక్కలు నాటిన తుంగ బాలు
తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని తార్నాకలోని తన నివాసం వద్ద టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

MP Santosh Kumar thanks to Ajay Devgan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News