Thursday, March 28, 2024

ధోని క్రికెట్ అకాడమీ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

MS Dhoni Cricket Academy opened in Bangalore

 

బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. గేమ్ ఆఫ్ ప్లే, ఆర్కా స్పోర్ట్ సంస్థలు సంయుక్తంగా బెంగళూరులో ఎం.ఎస్.ధోని క్రికెట్ అకాడమీని ప్రారంభించాయి. నగరంలోని బిదరహల్లిలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ అకాడమీలో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ఆరంభమయ్యాయి. నవంబర్ ఏడు నుంచి అకాడమీలో శిక్షణ ప్రారంభించనున్నారు. కాగా అకాడమీ ప్రారంభం సందర్భంగా ధోని యువ క్రికెటర్లకు ఓ సందేశం పంపాడు. అకాడమీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి వారి మెరుగైన శిక్షణ ఇవ్వడమే తమ ముఖ్య ఉద్దేశమన్నాడు. సుశిక్షితులైన కోచ్‌ల సమక్షంలో అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చాడు. బెంగళూరుకు చెందిన యువ క్రికెటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News