Thursday, April 25, 2024

ధోనీకి జరిమానా

- Advertisement -
- Advertisement -

ముంబయి: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపిఎల్ 14 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన 7 వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్లో ఓవర్ రేటు నమోదు చేసింది. ఇది ఐపిఎల్ ప్రవర్తనా నిబంధనల ఉల్లంఘన కావడంతో జట్టు కెప్టెన్ ధోనీకి రూ.12 లక్షలు జరిమానా విధించారు. మరో వైపు 161 రోజుల తర్వాత పొట్టీ క్రికెట్ ఆడిన ధోనీ తాను ఎదుర్కొన్న రెండో బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

MS Dhoni fined Rs 12 lakh for slow over rate

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News