Thursday, April 25, 2024

నేటితో ముగియనున్న ఎంఎస్‌సి నర్సింగ్ దరఖాస్తుల ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

MSC nursing application process ends today

హైదరాబాద్ : కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపిటి కోర్సు ప్రవేశాల ధరఖాస్తుల ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల ఆధారంగా ప్రొవిషనల్ మెరిట్ లిస్టును యూనివర్సిటీ విడుదల చేయనుందని అధికారులు తెలిపారు. అప్లై చేసిన అభ్యర్ధుల సర్టిఫికేట్లను ఈనెల 28వ తేదిన పరిశీలించిన తర్వాత తుది మెరిట్ లిస్టు ను విడుదల చేస్తామని వర్సిటీ మంగళవారం పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ప్రో. జి రాంరెడ్డి దూర విద్యకేంద్రం ఉస్మానియా యూనివర్సిటీకి హాజరుకావాలని హెల్త్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. మరింత సమచారం కొరకు www.knruhs.telangana.gov.in ను సంప్రదించాలని వర్సిటీ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News