Thursday, April 25, 2024

ముఖేశ్ అంబానీ కుటుంబం లండన్‌కు వెళ్లిపోతుందా?!

- Advertisement -
- Advertisement -

Mukesh Ambani

న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ. ఆయన లండన్‌లో ఉన్న బకింగ్‌హమ్‌షైర్‌లో రూ. 592 కోట్లు పెట్టి కొన్న 300 ఎకరాల ప్రదేశానికి తన కుటుంబసమేతంగా మకాం మార్చనున్నారని ‘మిడ్‌డే’ పత్రిక పేర్కొంది. స్టోక్ పార్క్ కంట్రీ క్లబ్‌లోని 49 బెడ్‌రూమ్‌లు ఉన్న భవంతిలోకి ఆయన కుటుంబం వెళ్లి బసచేయనుంది. అందులో అత్యాధునిక వైద్య సౌకర్యాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే అంబానీ కుటుంబం ఈ ఏడాది దీపావళి అక్కడే గడిపారట. ఈ వివరాలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలో  ‘ఈజ్ లండన్ ద లూటర్స్ ప్యారడైజ్???’  అన్న శీర్షికతో  వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News