- Advertisement -
అమరావతి: ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. శనివారం తాడేపల్లిలోని సిఎం క్యాంప్ ఆఫీసులో జగన్ను అంబానీ కలిశారు. ఈ సందర్భంగా ఎపిలో రిలయన్స్ పెట్టుబడులకు సంబంధించి ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపి పిరమళ్ నత్వానీ ఉన్నారు. అంతకు ముందు గన్నవరం విమానాశ్రయంలో వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ముఖేష్ అంబానీకి ఘన స్వాగతం పలికారు.
Mukesh Ambani Meet with AP CM Jagan
- Advertisement -