Wednesday, April 17, 2024

మునుగోడు ఉప ఎన్నిక: కారులో రూ.కోటి స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Munugode bypoll: Rs 1 crore seized at Chelmeda

మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చల్మెడ గ్రామం వద్ద కారులో కోటి రూపాయలను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. విజయవాడ నుండి కారులో ఈ నగదును తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విజయవాడ నుండి నగదును తీసుకువచ్చిన వారికి కరీంనగర్ జిల్లాతో కూడా సంబంధాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో వుంది. ఎన్నికల కోడ్ కారణంగా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు. అయితే కోటి రూపాయల నగదును కారులో తరలిస్తుండడంతో ఈ నగదును సీజ్ చేసి మునుగోడు పోలీస్‌స్టేషన్‌కు పోలీసులు తరలించారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకుగాను భారీగా నగదు పంపిణీ చేస్తున్నారని రాజకీయ పార్టీలపై ఆరోపణలున్నాయి. ఈ నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలను తమవైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు భారీగా డబ్బులను ఖర్చు చేస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ తరుణంలో డబ్బులు పట్టుబడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. సోమవారమే నామినేషన్ల ఉపసంహరణకు తెరపడింది. ఈ సమయంలో చల్మెడ వద్ద కోటి రూపాయలు దొరకడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 7వ తేదీన గూడపూర్ వద్ద కారులో రూ.79 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. నర్సింహ్మా అనే వ్యక్తి హైదరాబాద్‌లో ప్లాట్‌ను విక్రయించగా వచ్చిన డబ్బుగా పోలీసులకు చెప్పారు. దసరాను పురస్కరించుకుని తన స్వగ్రామానికి వచ్చిన సమయంలో ఈ డబ్బులను ఆయన తీసుకువచ్చాడు. హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల క్రితం నాలుగు రోజుల వ్యవధిలో రూ.10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో నగదును తరలిస్తున్న సమయంలో పోలీసులు సీజ్ చేశారు.

Munugode bypoll: Rs 1 crore seized at Chelmeda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News