Wednesday, April 17, 2024

టిఆర్‌ఎస్ నేతపై హత్యాయత్నం….

- Advertisement -
- Advertisement -

తుపాకీతో బెదిరింపు

Murder attempt on TRS Leader in Peddapalli

మనతెలంగాణ/కాల్వశ్రీరాంపూర్ : పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన టిఆర్‌ఎస్ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. మంగళవారం రాత్రి మండల కేంద్రానికి చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు నిదానపురం దేవయ్యను నలుగురు వ్యక్తులు తుపాకితో బెదిరించి హత్యాయత్నానికి ప్రయత్నించారు. దేవయ్య వారి వద్ద నుండి తుపాకీ లాక్కునే ప్రయత్నంలో తుపాకీ కింద పడడంతో గుర్తు తెలియని వ్యక్తులు పారిపోయినట్లు దేవయ్య వివరించారు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సిఐ మహేందర్‌రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ ఎస్‌ఐ వెంకటేష్‌లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భూ వివాదాలే బెదిరింపులకు కారణమని పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. నిందితులు వాడిన గన్ బొమ్మ తుపాకీగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News