- Advertisement -
హైదరాబాద్: ఆర్జివి దర్శకత్వం వహిస్తున్న మర్డర్ మూవీపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సినిమా హత్య కేసును ప్రభావితం చేస్తుందంటూ ఎస్సి, ఎస్టి కోర్టులో ప్రణయ్ తండ్రి ఫిర్యాదు చేశాడు. రామ్గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులకు కోర్టు ఆదేశించింది. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, మర్డర్ సినిమా నిర్మాత నట్టి కరుణ, నట్టి క్రాంతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సి, ఎస్టి కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు ఎస్పి రంగనాథ్ తెలిపారు.
- Advertisement -