Thursday, April 25, 2024

మద్యం మత్తులో స్నేహితుడి హత్య

- Advertisement -
- Advertisement -

Murder of friend under the influence of alcohol

 

మన తెలంగాణ/చాంద్రాయణగుట్ట: మద్యం మత్తులో స్నేహితుడిని కత్తితో పొ డిచి హత్యచేసిన సంఘటన ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ తెలిపిన వివరాల ప్రకారం… ఉప్పుగూడ అరుంధతికాలనీకి చెం దిన అయ్యవారి ఉమాకాంత్ (33) ఇటీవల మీర్‌పేట్‌కు మకాంమార్చాడు. ఉప్పుగూడ అరుంధతికాలనీ, రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన రవి (32), ఉమాకాంత్ స్నేహితులు. ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తుంటారు. శనివారం రాత్రి ఉమాకాంత్, రవి ఇంట్లో మద్యం సేవించాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవతో ఆగ్రహించిన రవి కత్తితో ఉమాకాంత్ పొట్టలో పొడిచాడు. దీంతో అతడు తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే మరణించాడు. 2017లో మెదక్ కౌడిపల్లిలో జరిగిన ఒక హత్యకేసులో ఉమాకాంత్ నిందితుడుగా ఉన్నాడు. ఇతనిపై మరో రెండు పెట్టి కేసులున్నాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యచేసిన రవి కోసం గాలిస్తున్నారు. అతడు దొరికితేగాని హత్యకు గల కారణాలు తెలియవని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న దక్షిణ మండల డీసీపీ డాక్టర్ గజారావు భూపాల్, ఫలక్‌నుమా ఏసీపీ ఎం.ఎ. మజీద్‌లు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆనవాళ్లు సేకరించారు. బా ధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బి.మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News