Friday, April 19, 2024

గోల్కొండలో యువకుడి హత్య

- Advertisement -
- Advertisement -

Murder of young man in Golconda

బండరాళ్లతో కొట్టి చంపిన గుర్తుతెలియని నిందితులు

హైదరాబాద్ : యువకుడిని బండ రాళ్లతో కొట్టిచంపిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….టోలిచౌకి గుల్షన్ కాలనీకి చెందిన మొహ్మద్ నవాజ్(22) సెంట్రింగ్ పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం పని కోసం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బాధితుడి కోసం వెతికినా ఆచూకీ లభ్యంకాలేదు. ఈ క్రమంలోనే గోల్కోండ, ఆట్టరాసిడి దర్గా వద్ద నవాజ్ మృతదేహం పడి ఉంది. మృతదేహం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నవాజ్ తలపై బండరాయితో కొట్టి చంపినట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన నిందితులను గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సిసి టివిల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గోల్కొండ ఇన్స్‌స్పెక్టర్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News