- Advertisement -
హైదరాబాద్: మెగా కుటుంబంలో వచ్చే ఏడాది రెండు పెళ్లిళ్లు జరగనున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇటీవల నాగబాబు ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని.. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శుభ్రంగా ఉన్నట్లైతే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చన్నారు. ఇక, కరోనా వైరస్, లాక్డౌన్ వల్ల ప్రతిఒక్కరి జీవితంలో భారీ మార్పులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా తన కూతురు నిహారిక, కొడుకు వరుణ్ తేజ్ వివాహాలపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే యేడాది నిహారికకు పెళ్లి చేస్తానని నాగబాబు చెప్పారు. నిహారిక పెళ్లి తర్వాత యేడాది చివరి కల్లా వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేస్తానని తెలిపారు. వాళ్లిద్దరి పెళ్లి అయితే..తాను కాస్త రిలాక్స్ అవుతానని నాగబాబు పేర్కొన్నారు.
Nagababu opens up Niharika and Varun Marriage
- Advertisement -