Friday, March 29, 2024

పూజా హెగ్డేతో నాగార్జున మాజా యాడ్..

- Advertisement -
- Advertisement -

కోకాకోలా ఇండియా యొక్క దేశీయంగా అభివృద్ది చేసిన మామిడి పానీయం, ఇండియా, ఆగ్నేయాసియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మజా ఇప్పుడు తమ నూతన ‘ఆమ్‌వాలీ దిల్‌దారీ, బినా నామ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించింది. ప్రస్తుతం, కోకా కోలా ఇండియా బ్రాండ్‌కు అగ్రగామి బ్రాండ్లలో ఒకటిగా మాజా నిలిచింది. స్ర్పైట్‌ మరియు థమ్సప్‌లు 2022లో ఒక బిలియన్‌ యుఎస్‌డీ బ్రాండ్‌గా నిలిస్తే, 2023లో మజాను ఒక బిలియన్‌ డాలర్ల మార్కుకు చేర్చడానికి లక్ష్యంగా చేసుకుంది.

తాజా ప్రచారంలో వెటరన్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మరియు సుప్రసిద్ధ నటి పూజా హెగ్డే తో పాటుగా దక్షిణాది సూపర్‌స్టార్‌ నాగార్జున కూడా కనిపించనున్నారు. ఇటీవలనే ఆయన మజా బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.

ఈ నూతన ప్రచారం గురించి కోకా కోలా ఇండియా మరియు ఆగ్నేయాసియా డైరెక్టర్‌ – మార్కెటింగ్‌ , న్యూట్రిషన్‌ విభాగం అజయ్‌ కొనాలీ మాట్లాడుతూ ‘‘ మజా ఓ వారసత్వ భారతీయ బ్రాండ్‌. 1976 నుంచి ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దశాబ్దాలుగా భారతీయులు అభిమానించే మ్యాంగో డ్రింక్‌గా ఇది నిలిచింది. సాటిలేని రుచులతో కూడిన అసలైన మామిడితో అసాధారణ వృద్ధికి ఇది తోడ్పడుతుంది. మా తాజా ప్రచారం, ఆమ్‌ వాలీ దిల్‌దారీ, బినా నామ్‌ వాలీ దిల్‌దారీ ద్వారా, అసలైన సంతోషం మరియు ఆనందాన్ని నిస్వార్ధమైన దాతృత్వం ద్వారా వెల్లడిస్తున్నాము. బచ్చన్‌, పూజాహెగ్డే మరియు నాగార్జునలు మా బోర్డ్‌ పై రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు

నూతన మజా ప్రచారం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘ఈ బ్రాండ్‌ నా పాత రోజులను గుర్తుకు తీసుకువచ్చింది. మామిడి పళ్లను ఆ రోజుల్లో ఎంతగానో ఆస్వాదించాను. ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను ’’అని అన్నారు. ఓగ్లీవీ ఇండియా చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌ సుకేష్‌ నాయక్‌ మాట్లాడుతూ ‘‘ఇతరులకు సహాయం చేయడంలోని అందాన్ని ఈ ప్రచారం ద్వారా వెల్లడిస్తున్నాము. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, పూజా హెగ్డే లాంటి బ్రాండ్‌ అంబాసిడర్‌ ల ద్వారా ఈ సందేశాన్ని మరింత ఉన్నతంగా వెల్లడిస్తున్నాము’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News