Thursday, April 25, 2024

కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక పోలింగ్

- Advertisement -
- Advertisement -

nagarjuna sagar by-election polling

నల్లగొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 3 ఈవీఎం యూనిట్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 3,145, మంది పోలింగ్ సిబ్బంది, 3 కేంద్ర బలగాల పహరా కాస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది మాత్రమే ఓటేసే అవకాశం ఉంది. కోవిడ్ బాధితులకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. 108 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

nagarjuna sagar by-election polling

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News