Saturday, April 20, 2024

గరిష్ట స్థాయికి చేరుకున్న నాగార్జున సాగర్ నీటిమట్టం

- Advertisement -
- Advertisement -

Nagarjuna Sagar water level reaches maximum level

4 క్రస్ట్ గేట్లను… 5 అడగుల మేరకు ఎత్తి నీరు దిగువకు
ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరదనీరు భారీగా చేరిక

హైదరాబాద్: నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. వెంటనే అధికారులు 4 క్రస్ట్ గేట్లను 5 అడగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరదలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జలాశయానికి 75 వేల 555 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 75, 555 క్యూసెక్కుల నీటిని స్పిల్ వే ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం ఎడమ కాలువకు 8 వేల క్యూసెక్కుల నీరు, ఎమ్మార్పీ 1800 క్యూసెక్కుల నీరు, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32వేల 400 క్యూసెక్కుల నీరు రాగా మొత్తం 75 వేల క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లో గా విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి నిన్నటి వరకు ఇన్ ఫ్లో తక్కువగా ఉండడంతో అధికారులు గేట్లను మూసివేశారు. వరద ప్రవాహం పెరగడంతో మళ్లీ ఆదివారం ఉదయం 2 గేట్లను ఎత్తారు. అనంతరం వరదనీరు పెరగడంతో మరో రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ 312.04 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 311.74 టిఎంసీల వరకు నిల్వ ఉంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు 5,516 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5,516 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 19.00084 టిఎంసిలుగా కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News