- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. హ్యాకర్స్ ఆమె ఖాతాలో అసభ్యకర మెసేజ్ లు, ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారని నైనా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్బుక్ లో ఆమెకు రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నగరంలోని కాచిగూడకు చెందిన జైస్వాల్ అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు పలు పతకాలు అందించింది. చదువులోనూ చురుకుగాఉండే నైనా, ఎనిమిదేండ్ల వయసులోనే 10వ తరగతి పూర్తిచేసింది. రెండు చేతులతోనూ ఒకేసారి రాయగల నేర్పు ఉన్న ఆమె 17 ఏళ్ల నుంచి పిహెచ్డి మొదలుపెట్టింది.
Naina Jaiswal Facebook Account Hacked
- Advertisement -