Saturday, April 20, 2024

అప్పట్లో నల్లగొండ ఎడారి… ఇప్పుడు పచ్చని జిల్లా: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Nalgonda is desert in past time but crop district

నల్లగొండ: సమైక్య పాలకులు నల్లగొండ జిల్లాలను ఎడారిగా మార్చారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. నల్లగొండ నివేదన సభ సర్వం సిద్దమైందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాగార్జున ఆయకట్టు రైతుల కల సాకారమైందని, జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు 13 ఎత్తిపోతల పథకాలను సిఎం కెసిఆర్ శంకుస్థాపనలు చేయనున్నారని చెప్పారు. చివర ఆయకట్ట వరకు నీళ్లు అందించడమే కెసిఆర్ లక్ష్యమన్నారు. సిఎం కెసిఆర్ కృషితోనే నల్లగొండ ఆకు పచ్చజిల్లాగా మారిందని, తెలంగాణ ఏర్పడిన తరువాత అత్యధికంగా లాభం పొందిన జిల్లా నల్లగొండ అని స్పష్టం చేశారు. అత్యధికంగా ఎక్కువ భూమి సాగుచేయడంతో పాటు ఎక్కువ పంటను పండించిన జిల్లాగా నల్లగొండ తొలి స్థానంలో ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News