Saturday, April 20, 2024

అమెరికాలో కాల్పులు…. నల్లగొండ వాసి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: నల్లగొండ జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన అమెరికాలోని మేరీలాండ్ లో జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయి చరణ్ దుర్మరణం చెందారు. సాయి చరణ్ రెండు సంవత్సరాల నుంచి బాల్టిమోర్ లో నివసిస్తున్నాడు. తన స్నేహితుడిని విమానాశ్రయంలో వదిలి వెళ్తుండగా అతడిపై నల్ల జాతీయుడు కాల్పులు జరిపాడు. దీంతో సాయి చరణ్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అమెరికా పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయి చరణ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News