Friday, April 19, 2024

కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఎఐసిసి అధ్యక్షుడికి పంపారు. త్వరలో ఆయన బిజెపిలో చేరనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేతలతో సంప్రదింపులు జరిపారు. కీలక పదవి ఇస్తామనే హామీతోనే బిజెపిలోకి చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌తోనే రాజకీయ జీవితం ప్రారంభించిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో పలు పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభపతిగా కూడా పనిచేశారు. 2010 నవంబర్‌లో ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు సైలెంటుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఎపిలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో కిరణ్ కుమార్ రెడ్డి అంత యాక్టివ్‌గా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే బిజెపి పెద్దలు ఆయనతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగింది. ఆ ప్రచారం నేడు వాస్తవ రూపం దాల్చనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News