Tuesday, April 16, 2024

వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిలకు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూబ్లీహిల్స్‌లో నిరసనకు వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారిపై దాడి చేసినందుకు షర్మిలను సోమవారం అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.

అయితే, సోమవారం రాత్రి ఆమె లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో, కోర్టు ఇరు పక్షాల వాదనలు విని, మంగళవారం మధ్యాహ్నం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.30 వేలతో ఇద్దిరి జామీను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విదేశాలకు వెళ్తే కోర్డు అనుమతి తీసుకోవాలని షర్మిలకు షరతు పెట్టింది. మంగళవారం సాయంత్రం ఆమె జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News