Wednesday, April 24, 2024

ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్‌కు జరిమానా

- Advertisement -
- Advertisement -

Nampally special court fined to MLA Dasyam Vinay Bhaskar

 

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్‌కు నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం నాడు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆయనపై నేరం రుజువైనట్లు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈ కేసులో వినయ్ భాస్కర్ సహా 18 మందికి న్యాయస్థానం రూ.3 వేలు జరిమానా విధించింది. ఈ క్రమంలో దాస్యం వినయ్ భాస్కర్ అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. ఇదిలావుండగా దాస్యం వినయ్‌భాస్కర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కాజీపేట వద్ద రైలురోకో సందర్భంగా ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News