Friday, April 19, 2024

కొండను తవ్వి ఎలుకను పట్టారు: నారా లోకేశ్

- Advertisement -
- Advertisement -

nara-lokesh

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటి దాడులకు టిడిపికి ముడిపేడుతూ వైసిపి నేతలు చేస్తున్న ప్రచారంపై విషయం కొండను తవ్వి ఎలుకను పట్టారని టిడిపి నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఇన్ఫ్రా కంపెనీల్లో దాడులు జరిగితే వాటిని టిడిపికి ముడిపెట్టేందుకు వైసిపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని లోకేష్ వరస ట్వీట్స్ చేశారు. ”పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జగన్ గారికి లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు. ఐటీ రైడ్స్ లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్ధమైంది” అని విమర్శించారు.

”దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే 85 లక్షలు దొరికాయి అని ఐటి శాఖ అంటుంటే చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో 2 వేల కోట్లు దొరికాయి అని తప్పుడు ప్రచారం చేస్తూ వైకాపా నాయకులు శునకానందం పొందుతున్నారు.అని నారా లోకేష్ మండిపడ్డారు. ”రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది అన్న భయం జగన్ ని వెంటాడుతోంది. అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్ కి టిడిపి కి ముడి పెట్టాలని తెగ తాపత్రయపడుతున్నారు.” ”ఇన్ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఆ కంపెనీల్లో జరిగిన రైడ్స్ కి టిడిపి కి ముడిపెట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే అయినా అలాంటి కోరికలు మాకు లేవు” అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Nara Lokesh Tweet on Andhra Pradesh IT Raids

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News