Wednesday, April 24, 2024

హరితోద్యమం.. అభినందనీయం: ఆర్.నారాయణమూర్తి

- Advertisement -
- Advertisement -

* పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి

హైదరాబాద్ : పర్యవరణ పరిరక్షణకు తోడ్పడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితోద్యమం అభినందనీయమని పీపుల్స్ స్టార్ ప్రముఖ దర్శకుడు,నటుడు,నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శనివారం జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్‌లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం స్ఫూ ర్తితో ఎంపి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఎందరినో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ పర్యవరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారని అభినందించారు.

సకాలంలో వర్షాలు కురవాలన్న, వాతావరణంలో మార్పులను అరికట్టాలన్న మొక్కలు నాటడం ద్వారానే సాధ్యమని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుంచి వలసలు పోయేవారని కానీ నేడు తెలంగాణకు వలసలు పెరిగాయని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషంగా ఉందని ఎంపి సంతోష్‌కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News