Saturday, April 20, 2024

ఇఫికి ఎంపికైన ‘నాట్యం’

- Advertisement -
- Advertisement -

Natyam movie Selected for screening at International Film Festival of India

 

ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఈనెల 20న గోవాలో ప్రారంభమవుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో సంధ్యారాజు మాట్లాడుతూ తెలుగు నాట్యకళలకు మరింత గుర్తింపును తీసుకువచ్చే చిత్రంగా రూపొందిన ‘నాట్యం’ ఇఫికి ఎంపికవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రేవంత్ కొరుకొండ మాట్లాడుతూ “భారతీయ, తెలుగు సంస్కృతి గొప్పతనం తెలియజేసేలా ఈ సినిమా తీశాం. త్వరలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నాం”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News