Saturday, April 20, 2024

ఆమె నా భార్య.. జిల్లా కోర్టులో నవీన్‌రెడ్డి కేసు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పెళ్లి నిశ్చితార్థం రోజున యువతి కిడ్నాప్‌ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో కలకలం సృష్టించింది. ఆమె ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపై కర్రలు, కత్తులతో దాడిచేశారు. యువతి బంధువులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. కిడ్నాప్‌ చేసిన యువకుడి టీ దుకాణాన్ని తగులబెట్టారు. పోలీసులు సంఘటన జరిగిన 6 గంటల లోపే అమ్మాయిని రక్షించారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు ఇవి..

బ్యాడ్మింటన్‌ శిక్షణ కేంద్రంలో పరిచయం..

నాగర్‌కర్నూల్‌ జిల్లా ముచ్చర్లపల్లికి చెందిన దామోదర్‌రెడ్డి సైన్యంలో పనిచేసి కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మన్నెగూడలో కుటుంబంతో స్థిరపడ్డారు. కుమార్తె(24) నగరంలో బీడీఎస్‌ చదువుతోంది. బొంగుళూరులోని ఓ బ్యాడ్మింటన్‌ శిక్షణ కేంద్రంలో ఆమెకు హస్తినాపురం నివాసి మిస్టర్‌ టీ కంపెనీ ఎండీ కె.నవీన్‌రెడ్డి (29)తో 2021లో పరిచయం ఏర్పడింది. అతడి స్వస్థలం నల్గొండ జిల్లా ముషంపల్లి. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.

రెండు కుటుంబాలు కలిసి గోవా, విశాఖపట్నం తదితర పర్యాటక ప్రాంతాలు చుట్టొచ్చాయి. పెళ్లి విషయంలో కుటుంబాల మధ్య స్పర్థలు తలెత్తాయి. అప్పటి నుంచి ఆమె నవీన్‌రెడ్డిని దూరంగా ఉంచింది. దీన్ని మనసులో ఉంచుకొని వాట్సప్‌ మెసేజ్‌లు పంపటంతో యువతి కుటుంబ సభ్యులు సెప్టెంబరులో ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత బెయిలుపై బయటకు వచ్చి మన్నెగూడ సిరి టౌన్‌షిప్‌ కాలనీకి మకాం మార్చాడు. యువతి ఇంటి సమీపంలోనే ఖాళీ ప్లాటును లీజుకు తీసుకుని రెస్టారెంట్‌ ఏర్పాటుకు షెడ్‌ నిర్మించాడు. తనను కాదంటే ఎవరికీ దక్కనివ్వనని ఆమెను బెదిరించే వాడు.

ఆమె నా భార్య..

‘‘గతేడాది ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామంలోని దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం. తన కూతురు బీడీఎస్‌ పూర్తి చేసేంత వరకూ పెళ్లి విషయం బయట పెట్టవద్దని ఆమె తండ్రి కోరారు. కొత్తగా కొనుక్కున్న కారుకు ఆమే నామినీ. ఈ ఏడాది జులై 1 నుంచి ఆమె తల్లిదండ్రులు బెదిరించి నా భార్య మనసు మార్చారు’’ అని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో నవీన్‌రెడ్డి కేసు వేశాడు. తనకు విడాకులు ఇవ్వకుండానే ఆమె ఇతరులతో పెళ్లికి సిద్ధపడుతోందంటూ ఆధారాలు చూపుతూ కోర్టు ద్వారా పోలీసులకు, యువతి కుటుంబికులకు నోటీసులు పంపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News