Friday, March 29, 2024

అమరీందర్ మోసగాడు, పిరికివాడు: కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు

- Advertisement -
- Advertisement -

Navjot Singh remarks on Amarinder Singh

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్‌సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోసగాడు, పిరికివాడు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కెప్టెన్ తన రాజీనామా లేఖను పంపిన మరుసటి రోజే నవజోత్ విమర్శల దాడికి తెరతీశారు. సోనియాకు రాసిన లేఖలో తనపై కెప్టెన్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు అంతే ఘాటుగా నవజోత్ సమాధానమిచ్చినట్టయింది. నవజోత్‌ను చపలచిత్తుడని, పాకిస్థాన్ అనుకూలుడని కెప్టెన్ తన లేఖలో పేర్కొనడం గమనార్హం. కెప్టెన్ వెంట కాంగ్రెస్ నుంచి కనీసం ఓ కౌన్సిలర్ కూడా వెళ్లలేదని నవజోత్ అన్నారు. చివరికి కెప్టెన్ భార్య ప్రణీత్‌కౌర్ కూడా కాంగ్రెస్ గుర్తుపైనే ఎన్నికయ్యారని నవజోత్ గుర్తు చేస్తూ, ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారేమో అడగాలంటూ సవాల్ విసిరారు. మంత్రులు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని కెప్టెన్ చేసిన విమర్శలను నవజోత్ తిప్పికొట్టారు. ముఖ్యమంత్రిగా వారిపై చర్యలు తీసుకోకుండా నిద్రపోయారా అని కెప్టెన్‌ను నవజోత్ ప్రశ్నించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19 వరకు అమరీందర్ పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News