Friday, March 29, 2024

సుక్మా జిల్లా సరిహద్దులో నక్సల్స్ విధ్వంసం

- Advertisement -
- Advertisement -

కాంట్రాక్టర్‌ను హతమార్చి, వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

మనతెలంగాణ/ కొత్తగూడెం : అభివృద్ధి పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా మావోయిస్టులు, చత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలో రెచ్చిపోయి విధ్వంసానికి దిగారు. రెండు రాష్ట్రాల్లోని రోడ్డు తదితర నిర్మాణ పనుల్లో ఉన్న వాహనాలను తగులబెట్టారు. సుక్మా జిల్లా సరిహధ్దులోని ఒరిస్సా మల్కాన్ గిరి సరిహద్దులో ఒక కాంట్రాక్టరు హతమార్చారు. గురువారం ఉదయం సుమారు 10.30 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. అతనికి చెందిన ఒక్ పొక్లైన్, ఒక ఎస్‌యువి వాహనం మరో వాహనం తగుబెట్టారు. సుకుమార్ మండల్ అనే కాంట్రాక్టర్ ను హత్య చేశారు. మధీలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని డోంగ్రి గూడ, గోలియాగుడా వద్ద ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతరం పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా చత్తీస్‌గఢ్‌లో సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందిన విషయం విధితమే. మరో సంఘటనలో గాదిరాం -ఫూల్‌బడ్‌గి సరిహధ్ధు ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News