Thursday, April 25, 2024

నిత్యం బీద ప్రజల కోసం పరితపించిన మహామనిషి: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పై నాయినిది చెదరని ముద్ర

కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన మహానేత

నిత్యం బీద ప్రజల కోసం పరితపించిన మహామనిషి

మంత్రి జగదీష్ రెడ్డి

Nayani narsimha reddy death anniversary

హైదరాబాద్: తెలంగాణలో హైదరాబాద్ నగరంపై దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేశారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండు సమీపంలో పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో దివంగత నాయిని సంస్మరణ సభకు మంత్రి జగదీష్ రెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర నాయక్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత నాయిని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు.  అటువంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తుచేశారు. నిత్యం బీద ప్రజల అభ్యున్నతికి కోసం పరితపించిన మహానేత నాయిని నర్సింహారెడ్డి అని ఆయన కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News