- Advertisement -
కరోనా వైరస్ మూలంగా ప్రకటించిన లాక్ డౌన్ దేశంలోని చిత్ర పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. షూటింగులు ఆగిపోవడంతో సినీ కార్మికులు పనుల్లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ బ్యూటీ నయనతార తన వంతుగా సినీ కార్మికుల కోసం విరాళాన్ని అందజేశారు. ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా)కి ఆమె 20 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. టాలీవుడ్లో కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో సినీ కార్మికుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ జరుగుతోంది. ఇక తమిళనాడులో కూడా పలువురు సినీ ప్రముఖులు సినీ కార్మికులను ఆదుకోవడానికి తమ వంతు సహాయం చేస్తున్నారు.
Nayanthara Donated for movie workers
- Advertisement -