Thursday, March 28, 2024

డ్రగ్స్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

NCB arrests 2 more persons in drug probe

ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ అనుమానాస్పద మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో మరో ఇద్దరిని మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సిబి) అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టయినవారి సంఖ్య 18కి చేరింది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిసహా డ్రగ్స్ కేసులో ఇప్పటికే 16మందిని ఎన్‌సిబి అరెస్ట్ చేసింది. తాజాగా రియా సోదరుడు శౌవిక్ పాఠశాల మిత్రుడు సూర్యదీప్‌మల్హోత్రాను ముంబయిలో, మరో నిందితుడు క్రిస్‌కోస్టాను గోవాలో ఎన్‌సిబి అరెస్ట్ చేసింది. రియాకు సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్‌సిబికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు జరుపుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News