Thursday, April 25, 2024

వాతావరణ మార్పులపై అధ్యయనం అవసరం: మంత్రి అల్లోల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సమతుల్య వాతావరణం.. మార్పులకు సంబంధించి ఖచ్ఛితమైన సమాచారం ఇచ్చేలా ఈపిటిఆర్‌ఐ పరిశోధనలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం అర్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ శిక్షణ & పరిశోధన సంస్థ (ఈపిటిఆర్‌ఐ) రూపొందించిన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలుష్యరహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగంపై ప్రభావం, తదితర అంశాలపై మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు పెంచే కార్భన్ డై అక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్‌ల విడుదలను నియంత్రించి భవిష్యత్ తరాలు ఈ భూమిపై జీవించేలా అధ్యాయనాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘గ్రీన్ ఇన్షియేటివ్స్‘ అనే ఇతివృత్తంతో పాటు ప్రతి నెల జరుపుకునే ముఖ్యమైన పర్యావరణ దినోత్సవాల ఆవశ్యకతను ఈ క్యాలెండర్‌లో పొందుపరిచినట్లు పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్ జనరల్ అధర్ సిన్హా మంత్రికి వివరించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.సునీలా పాల్గొన్నారు.

Needed Study on climate change: Indrakaran Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News