Friday, April 19, 2024

అప్పుడు భర్త ఇప్పుడు భార్య అంజూ

- Advertisement -
- Advertisement -

ఖాట్మండూ : నేపాల్‌లో ఇప్పుడు జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన కో పైలెట్ అంజూ ఖాటివాడా కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. 16 సంవత్సరాల క్రితం 2006లో ఇదే యతి దేశీయ విమానయాన సంస్థ విమాన ప్రమాదంలో ఆమె భర్త పైలెట్ దీపక్ పోఖారెల్ మృతి చెందారు. అప్పట్లో ఆయన తక్కువ మంది ప్రయాణికుల విమాన దుర్ఘటనలో ప్రాణాలు వదిలారు.

ఇప్పుడు సేతి నది వద్ద కూలిన యతి విమానంలో అంజూ కో పైలెట్‌గా ఉన్నారు. అంజూ అమెరికాలో పైలెట్ కోర్సు చదవింది. తరువాత ఏవియేషన్ రంగంలో చేరింది. భర్త పైలెట్‌గా ఉండి ప్రమాదంలో చనిపోయిన తరువాత కూడా ఆమెను తండ్రి ఈ వృత్తి వద్దని వారించినా ఆమె అమెరికాకు వెళ్లి ఈ వృత్తిలో శిక్షణ పొంది ఇదే సంస్థలో కో పైలెట్‌గా చేరి ప్రమాదంలో దుర్మరణం చెందడం ఈ కుటుంబ సన్నిహితులకు బాధాకరం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News