- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వ్యయసాయ బిల్లుల పత్రాలను చింపేసిన విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లులను వ్యతిరేకిస్తూ పలువురు ఎంపిలు నినాదాలు చేశారు. అయితే 14 పార్టీల సభ్యులు సభలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించారు. విపక్షాల సవరణలను సభ తిరస్కరించింది. విపక్షాల ఆందోళన నడుమ బిల్లులపై డిప్యూటి ఛైర్మెన్ హరివంశ్ సింగ్ ఓటింగ్ నిర్వహించారు. మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం లభించింది. విపక్షాల ఆందోళన నడుమ వ్యవసాయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లులను పార్లమెంట్ లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
new agriculture bill passed in rajya sabha
- Advertisement -