Tuesday, April 23, 2024

గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్..

- Advertisement -
- Advertisement -

విజయవాడ: బెజవాడలో జరిగిన గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య సూర్యరత్న ప్రభను హోంగార్డ్ వినోద్ ఉద్దేశ్యపూర్వకంగానే తపాకీతో కాల్చి హత్య చేసినట్లు భవానిపురం పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ వింగ్ ఏఎస్పి అసిస్టెంట్‌గా వినోద్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, మూడు రోజు క్రితం ఏఎస్పి అనంతపురం వెళ్లాడు. ఈ సమయంలో ఏఎస్పి తన తపాకీని హోంగార్డ్ వద్ద ఉంచాడు. ఆ తుపాకీని ను హోంగార్డ్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇదే సమయంలో హోంగార్డ్ వినోద్ కు నగల తాకట్టు విషయంలో భార్యతో గొడవ జరిగింది. దీంతో వినోద్ ఆవేశంలో ఏఎస్పి గన్ తో తన భార్యను కాల్చాడు. బుల్లెట్ గుండెలోకి దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత గన్ మిస్ ఫైర్ అయినట్లు హోంగార్డ్ వినోద్ డ్రామా ఆడాడని పోలీసులు తెలిపారు.

New Angle in Vijayawada gun misfire case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News