హైదరాబాద్: వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళా అనుమానస్పదంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. మలక్ పేటకు చెందిన చంద్రకాంత్, లక్ష్మి దంపతుల మూడవ సంతానం పల్లవి. తనని ముద్దుగా పింకీ అని పిలుచుకునేవారు. కాగా, గత నెల 8 వ తేదీన వనస్థలిపురం శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన సంతోష్ తో వివాహం జరిపించారు. కొన్ని రోజులు వీరి దాంపత్య జీవితం బాగానే సాగినప్పటికీ.. తర్వాత అత్తింటి వేధింపులు మొదలయ్యాయి.
ఈ క్రమంలో ఇవాళ పల్లవి అలియాస్ పింకీ సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పల్లవి కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్ళైన నెలన్నరకే తమ కూతురు ఆత్మహత్య పాల్పడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అల్లారు ముద్దుగా పెంచిన తన చిట్టి తల్లిని విగతజీవిగా చూస్తామని కళ్లో కూడా ఊహించలేదని ఆమె తల్లి దండ్రుల కన్నీరు మున్నీరయ్యారు. తమ కూతురు మరణానికి భర్త, అత్తమామలే కారణమని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.