Friday, April 26, 2024

మీర్‌పేట్‌లో నవవధువు అదృశ్యం

- Advertisement -
- Advertisement -

New Bride Missing in Meerpet Hyderabad

బాలాపూర్ : నవవధువు అదృశ్యమైన సంఘటన మీర్‌పేట్ పొలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ మద్ది మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భోళ గ్రామం హనుమాన్‌ఘర్ధ్ మండలం రాజస్ధాన్ రాష్ట్రానికి చెందిన సూరజ్‌పాల్ బాలాపూర్ మండలం మీర్‌పేట్ పరిధిలోని మురళికృష్ణానగర్‌లో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. ఆ క్రమంలో గత 11 నెలల క్రితం రాజస్ధాన్‌కు చెందిన శబ్నమ్(19) అనే యువతిని వివాహం చేసుకున్నాడు.

కాగా రోజు మాదిరిగానే సూరజ్‌పాల్ మంగశవారం ఉదయం 9 గంటలకు తన కార్యాలయానికి వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి తిరిగివచ్చి చూడగా భార్య శబ్నమ్ ఇంట్లో కనిపించలేదు. వెంటనే ఆమె సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్‌గా ఉండడంతో అనుమానం వచ్చిన సూరజ్‌పాల్ భార్య ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మీర్‌పేట్ పొలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్‌కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News