Saturday, April 20, 2024

మహా భూమిని కనుగొన్న పరిశోధకులు

- Advertisement -
- Advertisement -

new exoplanet covered with deep ocean

ఇక్కడ సంవత్సరం అంటే 11 రోజులే …

న్యూఢిల్లీ : మాంట్రియల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఓ మహాభూమిని గుర్తించింది. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని, ఇక్కడ లోతైన మహాసముద్రాలు ఉంటాయని, ఇక్కడ సంవత్సరం అంటే కేవలం 11 రోజులు మాత్రమేనని చెబుతోంది. దీని పేరు టిఒఐ 1452 బి అని తెలిపింది. ఇది భూమి వంటి గ్రహమేనని వివరించింది. ఈ పరిశోధక బృందం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం మనం నివసిస్తున్న భూమి ఒక సూర్యుని చుట్టూ తిరుగుతోంది. కానీ టిఒఐ1452 బి మహాభూమి రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోంది. మన భూమి నుంచి ఇది దాదాపు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది మనభూమి కన్నా 70 శాతం పెద్దది. ఐదు రెట్లు బరువైంది. దీనిలో ఓ లోతైన మహాసముద్రం ఉండి ఉండవచ్చు. ఈ గ్రహం మొత్తం బరువులో 30 శాతం వరకు మహా సముద్రం ఉంది. మనం నివసిస్తున్న భూమిలో 70 శాతం వరకు నీరు ఉన్న సంగతి తెలిసిందే.

మన భూమి బరువులో కేవలం 1 శాతం మాత్రమే నీటి ప్రాంతం ఉంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం నీరు, భూమి నిష్పత్తిని మన సౌర వ్యవస్థ లోని వాటర్ మూన్స్‌తో పోల్చినప్పుడు , మంచు ఫలకాల కింద మహాసముద్రాలు ఉన్నట్టుగా ఈ మహా భూమిలోని సముద్రం ఉంది. ఈ మహాభూమి తన నక్షత్రం చుట్టూ భ్రమణాన్ని 11 రోజుల్లో పూర్తి చేస్తుంది. కాబట్టి ఇక్కడ సంవత్సరం అంటే 11 రోజులు మాత్రమే. మన సూర్యుడి నుంచి శుక్ర గ్రహానికి ఏ స్థాయిలో కాంతి అందుతోందో అదే స్థాయిలో ఈ మహాభూమికి తన నక్షత్రం నుంచి కాంతి అందుతుంది. ఈ మహాభూమి తన రెండో నక్షత్రం చుట్టూ తిరగడానికి దాదాపు 1400 సంవత్సరాలు పడుతుంది. ఈ మహాభూమిలో నీరు ఉన్నట్టు నిస్సందేహంగా చెప్పాలంటే మరికొన్ని పరిశోధనలు జరగవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News