- Advertisement -
తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో కొత్తగా మాసాయిపేట మండలం ఏర్పాటు
అంగీకరించిన సిఎం కెసిఆర్… త్వరలో ఉత్తర్వుల జారీ
హైదరాబాద్: మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అంగీకరించారు. నర్సాపూర్ ఎంఎల్ఎ చిలుముల మదన్రెడ్డి వినతి మేరకు సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చేగుంట మండలంలోని మూడు గ్రామాలు, యెల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలు కలిపి మొత్తం తొమ్మిది గ్రామాలతో మసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నూతన మండల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి.
- Advertisement -