Friday, April 19, 2024

మోడల్ స్కూల్ టీచర్స్‌కు కొత్త పిఆర్‌సి

- Advertisement -
- Advertisement -
New PRC for Model School Teachers
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: రాష్ట్రంలో మోడల్ స్కూల్ టీచర్స్‌కు కొత్త పిఆర్‌సి అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులో రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న 3 వేల మంది ఉపాధ్యాయులకు కొత్త జీతాలు అందనున్నాయి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జిఒ ఎంఎస్ నెంబర్ 24 ద్వారా పిఆర్‌సి ఫిట్‌మెంట్ అమలు చేసినందుకు పిఆర్‌టియు టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్, ఎంఎల్‌సిలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి,కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్‌లు హర్షం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News