- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గురువారం కీలక ప్రకటన చేశారు. జూలై 5తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. అలాగే 57 ఏళ్లు నిండిన వారికి త్వరలో ఆసరా పింఛన్లు ఇస్తామన్నారు. కాగా జూన్ 8న దరఖాస్తు చేసుకుని పెండింగ్ లో ఉన్న దాదాపు 4.50 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండలం రాజుపేటలో పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. 70 ఏళ్లలో జరగని అనేక కార్యక్రమాలు ఏడేళ్లలో చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
New Ration Cards From June 5th In Telangana
- Advertisement -