Friday, March 29, 2024

నాల్గో వికెట్ కోల్పోయిన కివీస్… 27/4

- Advertisement -
- Advertisement -

New zealand loss four wickets for 27 runs
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు కివీస్ తొమ్మిది ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 27 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇంకా 298 పరుగుల ముందంజలో ఉంది. టామ్ లాథమ్ పది పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. విల్ యంగ్ నాలుగు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాస్ టేలర్ ఒక పరుగు చేసి సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. డారీ మిచెల్ ఎనిమిది పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోలస్ (04), టామ్ బ్లండెల్(0) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News